నల్లద్రాక్షతో ఫేషియల్‌.. మరింత యంగ్‌ లుక్‌లోకి

నల్ల ద్రాక్ష పండ్లను పేస్టులా చేసుకోవాలి.

ఇందులో ముల్తానీ మట్టి, రోజ్‌ వాటర్‌ బాగా కలిపి పేస్టులా చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి.

తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

కొన్ని నల్ల ద్రాక్షపళ్లను బాగా స్మాష్‌ చేసిగుజ్జు తీయాలి.

దీనిలోకి చెంచా పంచదార, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దన చేయాలి.

20 నిమిషాల తర్వాత ప్యాక్‌ కడిగేయాలి.

ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే ముఖం యంగ్‌లుక్‌తో కనిపిస్తుంది.

టొమాటో స్మాష్‌ చేసి అందులో ద్రాక్ష పండ్లను జోడించి మెత్తని పేస్టులా చేసుకోవాలి

దీన్ని ముఖం, మెడకు అప్లై చేస్తే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.