రాగి జావే కాదు, సగ్గుబియ్యం జావ కూడా అప్పుడప్పుడు తాగండి
రాగి జావలాగే సగ్గు బియ్యం జావ కూడా ఎంతో మేలు చేస్తుంది.
సగ్గు బియ్యంతో చేసే వంటకాలు శరీరానికి చలువ.
సగ్గుబియ్యం జావ వల్ల రక్తపోటు, డయాబెటిస్ అదుపులో ఉంటాయి.
సగ్గుబియ్యం జావ కోసం.. 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి.
అందులో గ్లాస్ పాలు, ఒక టీ స్పూన్ బెల్లం తురుము వేసి స్టవ్ మీద పెట్టి జావ తయారు చేయాలి.
నీరసం, అధిక బరువు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి సగ్గుబియ్యం జావ ఎంతో మంచిది.