తెలంగాణకు ఇప్పటివరకూ ఇచ్చిన అన్ని హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని మరోసారి ఇవాళ ఎక్స్ ప్లాట్ఫారమ్ వేదికగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
Mallikarjuna Kharge : తెలంగాణకు ఇప్పటివరకూ ఇచ్చిన అన్ని హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని మరోసారి ఇవాళ ఎక్స్ ప్లాట్ఫారమ్ వేదికగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. తమ ఏది చెబితే అది కచ్చితంగా చేసి తీరుతుందని ఖర్గే క్లారిటీ ఇచ్చారు.కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏది చెబుతుందో అది మాత్రం చేయడం లేదని ఆయన విమర్శించారు.
అంతేకాదు మరో ట్వీట్ చేసిన ఖర్గే..ఈరోజు ప్రత్యేక పార్లమెంట్ సెషన్లో కూడా ప్రజల కేంద్రీకృత సమస్యలపైనే చర్చించడానికి ఇండియా పార్టీలు ఎదురుచూస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రజల అభీష్టాన్ని, వారి అసంఖ్యాక కోరికలను కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా ఆశిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని దేశ ప్రజలకు జవాబుదారీగా ఉంచాలని తాము నిశ్చయించుకున్నామని ఖర్గే చెప్పారు. జుడేగా భారత్, జీతేగా ఇండియా అంటూ ఖర్గే ట్వీట్ చేశారు.