SSC Exams: ఏప్రిల్ 3 నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు
SSC Exams: ఇంటర్మీడియెట్ పరిక్షలు ఓవైపు జరుగుతున్నవేళ తాజాగా టెన్త్ పరీక్షల తేదీని ప్రకటించింది ఎస్ ఎస్ సి బోర్డు. ఏప్రిల్ 03 నుండి తెలంగాణ లో టెన్త్ పరీక్షలు మొదలుకాబోతున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 24 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని బోర్డు అధికారులు తెలిపారు. టెన్త్ పరీక్షలకు 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని విద్య శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఈసారి తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షలకు 6 పేపర్లు అన్న విషయం తెలిసిందే.
అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదేశించింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయా జిల్లాల అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. ప్రతి పరీక్షాకేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులోఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, నీటి సరఫరాతో పాటు ఇతర ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.