Mla Jaggareddy: విఆర్ఏ ల డిమాండ్స్ ను అమలు చేయండి సీఎం కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ
Mla Jaggareddy: వీఆర్ఏల సమస్యలపై సీఎం కేసీఆర్కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం విఆర్ఏ ల డిమాండ్స్ ను వెంటనే అమలు చేయాలని అన్నారు. చాలా రోజుల నుండి విఆర్ఏ లు వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు కానీ వారి సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇందులో భాగంగా వీఆర్ఏ లు సమ్మె కూడ చేశారన్నారు. ప్రభుత్వం వారి డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ కూడ ఇచ్చింది కానీ ఆచరణలోకి ఇంకా రాలేదన్నారు. వెంటనే వి ఆర్ ఏ లు కోరిన్నట్లు పే స్కేల్ పెంచాలి..పడవ తరగతి పాస్ అయిన వారికి అటెండర్ గ్రేడ్ పే స్కేల్ పెంచి 22వేల జీతం ఇవ్వాలి అలాగే ఇంటర్ పాస్ అయిన విఆర్ఏ లకు అసిస్టెంట్ గ్రేడ్ పే స్కేల్ ఇచ్చి 26వేల జీతం ఇవ్వాలి అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే విఆర్ఏ లకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
అలాగే ఎంఆర్వో, ఆర్డీఓ,జాయింట్ కలెక్టర్, కలెక్టర్ స్థాయి వారు కూడ వీరితో పని చేయించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా పని చేస్తూ చాలా కష్టపడుతారు. 10వేల 500 రూపాయల జీతం వీరికి సరిపోవు..బైక్ లో పెట్రోల్ పోసుకొని తిరుగడానికే సరిపోతాయి.. ఇంత పని భారం ఉన్న విఆర్ఏ లకు ప్రభుత్వం వెంటనే పే స్కేల్ పెంచి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.. నేను అసెంబ్లీ సమావేశాల్లో విఆర్ఏ ల సమస్య పై ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది. అలాగే మంత్రి కేటీఆర్ గారు విఆర్ ఏ లు సమ్మె చేస్తున్న సమయంలో చర్చలకు పిలిచి విఆర్ ఏ ల డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.కానీ ఇప్పటి వరకు వీఆర్ఏ ల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. అందుకే ఈ లేఖ ద్వారా మరోసారి మీ దృష్టికి తీసుకొచ్చి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాని లేఖలో పేర్కొన్నారు.