హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందుబాబుల వీరంగం
డ్రంక్ డ్రైవ్ లో మందుబాబుల వీరంగం చర్చనీయాంశంగా మారింది. పార్క్ హయాత్ దగ్గర సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉండగా పోలీసులకు మందు బాబులు చుక్కలు చూపించారు. రోడ్డు కు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. కొంతమందిని పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అని ఆరోపిస్తూ రోడ్ కి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు మందుబాబులు. వీరి మధ్యలో హిజ్రా లు కు చేరారు. బట్టలు విప్పి మరి చిందులు వేస్తూ పోలీసులను బూతులు తిట్టారు. అలా మూడు గంటల పాటు హల్చల్ చేశారు. ఈ క్రమంలో మరొకరు నేను మేడ్చల్ ఎమ్మెల్యే తమ్ముణ్ణి, నన్ను ఆపుతార అంటూ పోలీసులపై దౌర్జన్యానికి తెగబడ్డాడు. సరైన పత్రాలు చూపించక పోవడంతో వెహికల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డు పై వచ్చే మిగతా వాహనాలు ఆపుతూ వీరంగం ఆడాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారును అడ్డగించి, లోపల ఉన్నవారు బయట దిగాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారుకు జరిమానా విధించారు. గంటల తరబడి ఇతర వాహనాలకు, పబ్లిక్ కి న్యూసెన్స్ చేస్తూ ఉండండంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.