KTR to Delhi: చెల్లి కోసం ఢిల్లీకి మంత్రి కేటీఆర్?
KTR to Delhi: మంత్రి కేటీఆర్ ఢిల్లీకి బయలు దేరిన అంశం హాట్ టాపిక్ అయింది. అదేమంటే ఢిల్లీ లిక్కర్ కేసులో రేపు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతున్న క్రమంలో తన చెల్లికి నైతిక మద్దతు ఇవ్వడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక రేపు, ఎల్లుండి కేటీఆర్ ఉండనున్న ఢిల్లీలోనే ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కవిత ఈడీ విచారణ జరుగుతున్న సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిందని అంటున్నారు. ఇక కవిత విచారణకు ముందే సిసోడియా రిమాండ్ రిపోర్ట్తో ఈడీ సంచలనం సృష్టించి, అందులో కవిత పేరు ప్రస్తావించింది. ఇక కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని అన్నారు. విచారణ పేరుతో కవితను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టొచ్చని పేర్కొన్న ఆయన చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారని అన్నారు. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారని, కవితను కూడా చేరమన్నారని అన్నారు.