రాహుల్ పర్యటన డిమాండ్.. ప్రగతి భవన్ ముందుకు జగ్గారెడ్డి!
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ విధ్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే నిర్ధారించారు తప్ప రాజకీయం చేయడం కోసం కాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, తూర్పు జగ్గారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విభజన జరగాలని కోరిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అవుతారని, రాష్ట్రం ఇచ్చిన తర్వాత, హామీలన్నీ పూర్తయ్యాయా లేదా అనే విషయాన్ని విధ్యార్థులతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఓయూకి వస్తున్నారు తప్ప వేరే కారణం లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైస్ ఛాన్సలర్ కు వినతిపత్రం ఇస్తే, ఆ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకోలేదు అని ఆయన విమర్శించారు. అందుకే న్యాయస్థానం గడపతొక్కామని అన్నారు జగ్గారెడ్డి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను మరోసారి కలవడానికి ప్రయత్నించినా అందుబాటులో ఉండటం లేదని జగ్గారెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ రాహుల్ గాంధీ పర్యటనను వీసీ ప్రోద్బలంతో అడ్డుకుంటున్నారని, అందుకే ప్రగతి భవన్ ముందు తాను మరియు ఓయూ జేఏసీ విధ్యార్ది నాయకులు, ఎన్ ఎస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు బుధవారం సాయంత్రం ప్రగతి భవన్ ముందు నిరసన తెలపాలని నిర్ణయించామని జగ్గారెడ్డి తెలిపారు.