తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 4.15కు కొత్తగూడెంకు చేరుకొని 4.50కి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథిగృహానికి గెస్ట్హౌజ్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 4.15కు కొత్తగూడెంకు చేరుకొని 4.50కి బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ అతిథిగృహానికి గెస్ట్హౌజ్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఉదయం 8.40 గంటలకు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. 9.10కు వీరభద్ర ఫంక్షన్ హాలులో ‘గిరిజనుల ఆరోగ్యం’పై అవగాహన సదస్సులో పాల్గొంటారు. గిరిజనులతో మమేకం అయ్యి.. 11 నుంచి 12 గంటల వరకు రెడ్క్రాస్ సొసైటీ జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొని 12.15కు ఐటీసీ అతిథిగృహానికి చేరుకోనున్నారు.
అలాగే గవర్నర్ విలీన గ్రామాల ప్రజలతో సమావేశమవుతారు. విలీన గ్రామాల పై ప్రత్యేక దృష్టిసారించి రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలతో సమావేశకానున్నారని సమాచారం. విలీన గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందచేయాలని కోరనున్నట్లు తెలుస్తుంది. గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి పనులపై గవర్నర్ చర్చించనున్నారు. విలీన గ్రామాల్లో తీవ్రంగా ఉన్న నీటి సమస్య పరిష్కారానికి ఈరోజు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తుంది.
ఆతర్వాత మధ్యాహ్నం 1.20గంటలకు కొత్తగూడెంలోని ఇల్లెందు అతిథిగృహానికి వచ్చి అనంతరం రోడ్డు మార్గాన 2.30కు ఖమ్మం ఎన్నెస్పీ అతిథిగృహానికి చేరుకుంటారు. ఖమ్మంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో రైలెక్కి రాత్రి 10.35కి హైదరాబాద్కు బయల్దేరుతారు. ఏడాది వ్యవధిలో భద్రాచలాన్ని సందర్శించుకోవడం ఇది నాలుగోసారి.