ఖైరతాబాద్ మహాగణపతి(Khairatabad Ganesh)ని చూడటానికి భక్తులు క్యూ కడుతున్నారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది.
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణపతి(Khairatabad Ganesh)ని చూడటానికి భక్తులు క్యూ కడుతున్నారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది. గవర్నర్ తమిళిసై (Governor Tamilisai), హర్యానా గవర్నర్ దత్తాత్రేయ (Haryana Governor Dattatreya), మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav), ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) ఖైరతాబాద్ గణనాధుని తొలిపూజలో పాల్గొన్నారు.
ఇక ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మరోవైపు అక్కడ ఏర్పాటు చేసిన కళాకారుల ఆటపాటలతో… ఖైరతాబాద్ సందడిగా మారింది. ఈ ఒక్క రోజే లక్ష మంది భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతీ ఏడాది ఒక పేరుతో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణనాధుడు..ఈ సారి శ్రీ దశవిద్య మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. 63 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయగా.. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. అలాగే ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి.
ఇప్పటికే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బారికేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికక్కడ అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు జరగకుండా భారీ పోలీసు భద్రత ఏర్పాటుచేశారు.