CM Kcr: నేడు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో సీఎం కెసిఆర్ పర్యటన
CM Kcr: నేడు మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 9.45నిమిషాలకు మహబూబాబాద్ కు కేసీఆర్ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో.. అన్ని ఏర్పాట్లును అధికారులు పూర్తి చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఏర్పాట్లను పరిశీలించారు.
అలాగే ఉదయం 11.30 నుండి 12.30 వరకు 10 వేల మంది స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటలకు సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పయనం కానున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లి కొత్తగూడెం-పాల్వంచ జాతీయ రహదారి పక్కనే ఆధునిక హంగులతో నిర్మించిన కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు. జిల్లా పాలనాధికారి దురిశెట్టి అనుదీప్ను కొత్త కలెక్టరేట్ ఛాంబర్లో కూర్చోబెడతారు. కలెక్టరేట్లోని గదులు అధికారుల ఛాంబర్లు పరిశీలిస్తారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగించనున్నారు. ఈనెల 18 న కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు మంత్రి హరీష్ రావు.