Bandi Sanjay: మహిళా కమిషన్ సీరియస్ ప్రచారం.. నిజం కాదంటున్న బండి!
Bandi Sanjay: తనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని బండి సంజయ్ కుమార్ అన్నారు. సమాజానికి మంచి జరిగే విషయాలు లీక్ ఇస్తే తప్పులేదు… కానీ అందుకు భిన్నంగా లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. నా విషయంలో మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లు నేను భావించడం లేదన్న ఆయన మీడియాకు లీకులు పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్దంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై నాకు గౌరవం ఉందన్న బండి సంజయ్ ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతోనే మహిళా కమిషన్ పిలవగానే హాజరయ్యానని అన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చానని ఆయన అన్నారు. నా స్టేట్ మెంట్ ను మహిళా కమిషన్ రికార్డు చేసిందని, మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సుహ్రుద్బావ వాతావరణంలో జవాబిచ్చానని అన్నారు. ఇక బండి సంజయ్ కు మహిళా కమిషన్ వార్నింగ్ ఇచ్చిందంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో బండి రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.