పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ పార్టీ దృష్టిసారించింది. ఇందులో భాగంగానే లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రం తరపున లేవనెత్తాల్సిన కీలక అంశాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.