Virat Kohli: కింగ్ కోహ్లీ సెంచరీ, మూడేళ్ల నిరీక్షణకు తెర
Virat Kohli slammed a Century in Ahmedabad test
విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత సెంచరీ చేశాడు. ఆసీస్ జట్టుతో జరుగుతున్న నాల్గవ వన్డేలో శతకం సాధించాడు. 241 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 5 ఫోర్లతో 100 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 28వ సెంచరీ కావడం విశేషం. 2019లో టెస్టుల్లో సెంచరీ చేసిన కోహ్లీ ఇప్పటి వరకు మరో సెంచరీ చేయలేకపోయాడు. అహ్మదాబాద్ మ్యాచ్ ద్వారా ఆ కొరత తీరింది. ఈ సెంచరీ కింగ్ కోహ్లీకి 75వ సెంచరీ కావడం విశేషం.
2019 నవంబర్ 22న కోహ్లీ బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచులో సెంచరీ చేశాడు. ఆ తర్వాత 1206 రోజుల తర్వాత గానీ కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ రాలేదు. అహ్మదాబాద్ మ్యాచులో ఆ కొరత తీరింది. చాలా ఏళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేయడంతో స్టేడియంలో ప్రేక్షకులు కేరింతలతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కోహ్లీ కూడా భావోద్వేగానికి గురయ్యాడు.
5 వికెట్లు కోల్పోయి 444 పరుగు
150 ఓవర్లు ఆడిన తర్వాత భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 444 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 125 పరుగుల వద్ద అజేయంగా ఉన్నాడు. అక్షర్ పటేల్ 24 పరుగుల వద్ద ఉన్నాడు. శ్రీకర్ భరత్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన సహకారం అందించాడు. 44 పరుగులు చేసి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 28 పరుగులు చేసి ఔటయ్యాడు.
Virat Kohli scores a Test hundred for the first time in over three years 🎉#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/V3TIf48iVc
— ICC (@ICC) March 12, 2023
The Man. The Celebration.
Take a bow, @imVkohli 💯🫡#INDvAUS #TeamIndia pic.twitter.com/QrL8qbj6s9
— BCCI (@BCCI) March 12, 2023