Virat Kohli: శ్రీలంక మ్యాచ్ లో విరాట్ సెంచరీ.. కొత్త రికార్డు నమోదు!
Virat Kohli Scores 46th Odi Century : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించాడు. భారత జట్టు ప్రముఖ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్లో 46వ సెంచరీని నమోదు చేశాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో మూడో మ్యాచ్లో (IND vs SL), విరాట్ 85 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సమయంలో అతను 10 ఫోర్లు మరియు ఒక సిక్స్ కొట్టాడు. నాలుగు వన్డేల్లో అతనికిది మూడో సెంచరీ. అంతకుముందు బంగ్లాదేశ్తో జరిగిన చివరి వన్డేలో విరాట్ సెంచరీ సాధించాడు. శ్రీలంకతో జరిగిన ఈ సిరీస్లో తొలి మ్యాచ్లోనూ విరాట్ సెంచరీ సాధించాడు. అయితే గత మ్యాచ్లో కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు.
కానీ నేటి మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అతనికి ఇది 74వ సెంచరీ. అలా వన్డే క్రికెట్లో శ్రీలంకపై విరాట్ కోహ్లీకి ఇది 10వ సెంచరీ. ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా విరాట్ నిలిచాడు. వెస్టిండీస్పై విరాట్ 9, ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్.. ఆరంభం నుంచే శ్రీలంక బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. 48 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. తదుపరి 50 పరుగులు 37 బంతుల్లో పూర్తి చేశాడు. మొఖంలో వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. 463 మ్యాచ్లు ఆడిన సచిన్ తన బ్యాట్తో 49 సెంచరీలు సాధించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అతనికి కేవలం 3 సెంచరీల దూరంలో ఉన్నాడు. నాలుగు సెంచరీలు చేస్తే కనుక వన్డే క్రికెట్లో 50 సెంచరీలు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్మెన్గా విరాట్ నిలవనున్నాడు.
ODIల్లో అత్యధిక సెంచరీలు