Rishabh Pant : యాక్సిడెంట్ తర్వాత తొలిసారి ట్వీట్ చేసిన ‘పంత్’
Rishabh Pant : భారతీయ క్రికెటర్ రిషబ్ పంత్ గత నెల 30న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 18 రోజుల తరువాత తొలిసారిగా ట్వీట్ చేశాడు. తన సర్జరీ విజయవంతమైందని, కోలుకుంటున్నానని ఇకపై వచ్చే ప్రతి సవాలును దైర్యంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, మీ అందరి మద్దతు, విషెస్ చూసి చాలా సంతోషిస్తున్నా. నాకు ఇంత ప్రేమ పంచినందుకు ధన్యవాదాలు అని అన్నాడు.
కొత్త సంవత్సరానికి ముందు రూర్కీ సమీపంలో పంత్ వెళ్తున్న కారుకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్కు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన తర్వాత శస్త్రచికిత్స అవసరం ఉండటంతో అతన్ని ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడే అతనికి పలు ఆపరేషన్లు జరిగాయి. ముఖ్యంగా అతని మోకాళ్లకు శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక 2023 ఐపీఎల్ లో పంత్ జట్టులో లేడని సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు. అలాగే వచ్చే నెలలో ఆస్ట్రేలియాపై జరిగే గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ కి సంబంధించి భారత జట్టులో కూడా పంత్ లేడన్నారు.
I may not have been able to thank everyone individually, but I must acknowledge these two heroes who helped me during my accident and ensured I got to the hospital safely. Rajat Kumar & Nishu Kumar, Thank you. I'll be forever grateful and indebted 🙏♥️ pic.twitter.com/iUcg2tazIS
— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023