IPL: వచ్చే ఏడాది నుంచి రెండున్నర నెలల పాటు ఐపీఎల్ టోర్నీ
Indian Premier League: కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు జరపడం ద్వారా టోర్నీని మరింత జనరంజకం చేసేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా సానుకూలంగా స్పందించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రతిపాదించిన మేరకు వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ను రెండున్నర నెలల పాటు నిర్వహించేందుకు ప్రాథమికంగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు రెండున్నర నెలల ఐపీఎల్కు తన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్లో స్థానం కల్పించింది.
2023 నుంచి 2027 వరకు వివిధ దేశాల క్రికెట్ జట్ల పర్యటనలు, ఆయా లీగ్ల నిర్వహణను నిర్ధారించి తాజా ఎఫ్టీపీ రూపొందించారు. దీని ప్రకారం మార్చి చివరి వారం నుంచి జూన్ మొదటివారం వరకు ఐపీఎల్ కోసం కేటాయించారు. అటు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలు నిర్వహించే టీ20 లీగ్ల కోసం కూడా నూతన ఎఫ్టీపీలో స్థానం కల్పించారు. జులై-ఆగస్టు నెలల్లో ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ లేవీ ఆడదు. ఆ సమయంలో ఇంగ్లండ్లో హండ్రెడ్ పేరిట టీ20 లీగ్ నిర్వహించే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ బిగ్ బాష్ లీగ్ కోసం జనవరిలో విండో కేటాయించాలని ఐసీసీని కోరింది. దీనిపైనా ఐసీసీ సానుకూలంగా స్పందించినట్టు