బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచులు జరిగే సమయంలో బౌల్ చేసిన డాట్ బాల్స్ను బట్టి మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఈ విషయంలో టాటా కంపెనీలతో టై అప్ అయింది. ఒక్కడాట్ బాల్కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించింది.
For each dot ball bowled in IPL Play offs, BCCI Plant 500 Saplings
బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచులు జరిగే సమయంలో బౌల్ చేసిన డాట్ బాల్స్ను బట్టి మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఈ విషయంలో టాటా కంపెనీలతో టై అప్ అయింది. ఒక్కడాట్ బాల్కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఈ లెక్క ప్రకారం చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో ఏకంగా 84 డాట్ బాల్స్ నమోదయ్యాయి. ఈ 84 డాట్ బాల్స్ లెక్క చూస్తే మొత్తం 42.000 మొక్కలు నాటాల్సి ఉంటుంది.
మొత్తం 84 డాట్ బాల్స్
క్వాలిఫయర్ 1 మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన బౌలర్లు మొత్తం 84 డాట్ బాల్స్ బౌల్ చేశారు. చెన్నై జట్టు బౌలర్లు 50 డాట్ బాల్స్ వేయగా, గుజరాత్ బౌలర్లు 34 డాట్ బాల్స్ వేశారు. చెన్నై బౌలర్ రవీంద్ర జడేజా ఇరు జట్ల బౌలర్లందరి కంటే ఎక్కువ డాట్ బాల్స్ వేశాడు. రవీంద్ర జడేజే వేసిన 12 బంతులకు గుజరాత్ బ్యాటర్లు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. జడేజా మొత్తం 12 డాట్ బాల్స్ వేయగలిగాడు.
We are proud to partner @TataCompanies in planting 500 saplings for each dot ball in the @IPL playoffs. Qualifier 1 #GTvsCSK got 42,000 saplings, thanks to 84 dot balls.
Who says T20 is a batter’s game? Bowlers’ it’s all in your hands #TATAIPLGreenDots 🌳 🌳 🌳
— Jay Shah (@JayShah) May 24, 2023