WIPL: ఇండియన్ క్రికెట్లో అదానీ గ్రూప్ ఎంట్రీ, మహిళా ఐపీఎల్ టీమ్ కొనుగోలు
Adani Groups gets Ahmedabad franchise for women’s IPL
మహిళా ఐపీఎల్ టోర్నీలో ఆడే ఫ్రాంచైజీలు ఏవనే విషయం తేలిపోయింది. బీసీసీఐ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్న 5 సంస్థలు 5 జట్లను దక్కించుకున్నాయి. రూ.4699.99 కోట్లు ఇచ్చి జట్లను కొనుగోలు చేశాయి. అహ్మదాబాద్, ముంబై, బెంగళూర్, ఢిల్లీ, లక్నో ఫ్రాంచైజీలు తొలి మహిళా ఐపీఎల్ టోర్నీలో తలపడనున్నాయి. మార్చి నెలలో మహిళా ఐపీఎల్ జరగనుంది. ఫిబ్రవరి నెలలో ప్లేయర్ల వేలం జరగనుంది. మహిళా ఐపీఎల్ టోర్నీకి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనే పేరును కూడా ఫిక్స్ చేశారు.
ఫ్రాంచైజీలు – ఓనర్లు
అహ్మదాబాద్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఏకంగా రూ. 1289 కోట్లు ఖర్చు చేసింది.
ముంబై ఫ్రాంచైజీని ఇండియా విన్స్ స్పోర్ట్స్ గ్రూప్ కొనుగోలు చేసింది. రూ.912.99 కోట్లు ఖర్చు చేసింది.
బెంగళూర్ ఫ్రాంచైజీని రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.901 కోట్లకు కొనుగోలు చేసింది.
ఢిల్లీ ఫ్రాంచైజీని జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 810 కోట్లకు కొనుగోలు చేసింది.
లక్నో ఫ్రాంచైజీని కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 757 కోట్లకు కొనుగోలు చేసింది.
బీసీసీఐ సెక్రటరీ ఏమన్నారంటే..
మహిళా ఫ్రాంచైజీల బిడ్డింగ్ ద్వారా 4699.99 కోట్ల ఆదాయం బీసీసీఐ సమకూరింది. ఈ పరిణామంపై బీసీసీఐ సెక్రటరీ జై షా సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో మహిళా క్రికెట్ జట్లకు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శణమని అన్నారు. బీసీసీకి సమకూరిన ఆదాయం ద్వారా దేశంలో మహిళా క్రికెట్ మరింత అభివృద్ధి చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞.
The combined bid valuation is INR 4669.99 Cr
A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH
— BCCI (@BCCI) January 25, 2023
way for a transformative journey ahead not only for our women cricketers but for the entire sports fraternity. The #WPL would bring necessary reforms in women's cricket and would ensure an all-encompassing ecosystem that benefits each and every stakeholder.
— Jay Shah (@JayShah) January 25, 2023