Sachin Life-sized statue: ముంబాయి వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహం..
Sachin Tendulkar’s life-sized statue to be erected at Mumbai: లెజెండరీ క్రికెటర్..మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కనుంది. సుదీర్ఘ కాలం భారత్ క్రికెట్ క్రికెటర్ సేవలు అందించి..రిటైర్ అయి పదేళ్లు అయినా సచిన్ ఇప్పటికీ క్రికెట్ అభిమానుల్లో క్రేజ్ తగ్గలేదు. సచిన్ కు సంబంధించి ముంబాయి క్రికెట్ అసోసియేషన్ కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. సచిన్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సచిన్ త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే వెల్లడించారు.
ఏప్రిల్ 23న సచిన్ జన్మదినం కావటంలో ఆ రోజున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సచిన్ నుంచి దీనికి సంబంధించి అనుమతి తీసుకున్నారు. ఏప్రిల్ నాటికి సాధ్యం కాకుంటే ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే వాంఖడే స్టేడియం లో సచిన్ పేరు మీద ఓ స్టాండ్ కూడా ఉంది. కాగా సచిన్ భారత్ తరఫున 200 టెస్టు మ్యాచ్లు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (100) , పరుగులు 34,357 చేశాడు. వాంఖడే స్టేడియంలో ఇదే మొదటి విగ్రహం కానుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ తాజా నిర్ణయం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో వైరల్ అవుతోంది.