కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణుడు జగద్గురువై అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత నాటి నుంచి నేటి వరకు ఎందరికో మార్గదర్శి అయింది.
కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణుడు జగద్గురువై అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత నాటి నుంచి నేటి వరకు ఎందరికో మార్గదర్శి అయింది.ఆ కోవకు చెందినదే చాణక్యనీతి.పాటలీ పుత్రంలో తనపట్ల నందరాజుల దుశ్చర్యకు పంతం పట్టి,వాళ్లను సింహాసనం నుంచి దించేదాకా జుట్టు ముడి వేయమని శపథం చేస్తాడు. చాణక్యుడు(chanakya) నందరాజుల సంహారం జరిగాక,మౌర్యుడైన చంద్రగుప్తుణ్ని సింహసనంపై అదిష్టింప చేసి జడముడి వేసుకుని ప్రతిజ్ఙ నెగ్గించుకున్న దీశాలి. రాజ్యాధికారం కోసం పాటలీపుత్రంలో జరిగిన కుట్రలు, కుతంత్రాలు విస్తుగొలుపుతాయి.పాటలీపుత్రాన్ని మగధ సామ్రాజ్యంగా విస్తరింపచేయడంలో చాణక్యుడి పాత్ర ప్రశంసనీయమైనది.చణకుడి పుత్రుడు కావడం వల్ల చాణుక్యుడైనాడు.అసలు పేరు విష్ణు గుప్తుడు.కుశాగ్రబుద్ధి కలిగిన మేధావి. కుటిల రాజనీతిని ఒంట పట్టించుకోవడం వలన కౌటిల్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు. కొంత మంది అది చాణక్యుడి గోత్రమని అంటారు. చాణక్యుడికి ఆత్మాభిమానం ఎక్కువ.తీక్షణ స్వభావం కలిగి,దృడమైన సంకల్పంతో అత్యంత ప్రతిభావంతుడైన యుగద్రష్టగా పేరు పొందాడు. బుద్ధిబలాన్ని అమితంగా విశ్వసించే చాణక్యుడు జగత్తంతా దైవాధీనం ప్రకారం నడుస్తుందనేది భ్రమగా భావించేవాడు.
చంద్రగుప్తుడి రాజు గురువు ప్రధాన మంత్రి హితైషి,ఉత్తమ రాజనీతిజ్ఞుడైన చాణక్యుడు పట్టణానికి వెలుపల ఒక కుటీరంలో సాధారణ జీవితం గడిపేవాడు. చైనా దేశపు యాత్రికుడు ఫాహియాన్,బౌద్ధ గ్రంథాలు సేకరిస్తూ మగధకు చేరి వివాల దేశపు ప్రదానమంత్రి ఒక చిన్న కుటీరంలో బతుకుతున్నాడు. ప్రజలు సుఖ శాంతులతో ఆకాశ హర్మ్యాలలో నివసిస్తున్నారు. అని తన పుస్తకంలో రాసుకున్నాడు. నాయకులు ప్రజా సేవాతత్పరులై నిరాడంబర జీవితం గడపాలన్నది చాణక్య సందేశం. భారతదేశాన్ని పరిపాలించే నాయకులకు రాజనీతిలో తగిన విచక్షణ అందించడానికి అర్ధశాస్త్రం,లఘు,చాణక్య,వృద్ధ చాణక్య,చాణక్య నీతి శాస్త్రాలను అందించాడు చాణుక్యుడు. సిద్ధాంతపరమైన గ్రంథాల్లో చాణక్యనీతికి ఒక ఉత్కృష్ట స్థానం వుంది. జీవితాన్ని సుఖమయం,సఫలం చేయడానికి అవసరమైన అంశాలెన్నో వాటిలో పొందుపరిచి వున్నాయి. ఆదర్శవంతమైన పాలనావ్యవస్థ కోసం వేసే ప్రణాళికలు- ప్రజలు భూమి,ధనాధాన్యులను,సమకూర్చుకోవడానికి మూలాధికారం కలిగించేలా ఉండాలంటారు. చాణక్యుడు బృహత్తర పథకాల పేరుతో పన్నుల భారం మోపి ప్రజల నడ్డి విరగొట్టరాదని ఆనాడే బోధించాడు.
అనుభవంతో ఏర్పరుచుకున్న నమ్మకాలను ప్రాణప్రదంగా చూసుకోవాలి. శరీరానికి రోగం వస్తే అధికంగా బాధిస్తుంది. ధనవంతుణ్ని ప్రపంచం గౌరవిస్తుంది. ప్రతిభ వున్నవాడికి అన్నానికి లోటువుండదు.పూవులు పూయని చెట్టును ,తుమ్మెదలు చేరవు. బీదవాడికి విద్యే ధనం. వయసును బట్టి వేషధారణ బుద్ధి ఎలా వుంటే వైభవం ఇలా వుంటుంది. వ్యవహార దక్షత ,ధర్మం,కర్తవ్యనిష్ఠ,కర్మశీలత్వం-మానవ పురోగతికి దోహదపడుతాయన్నది చాణక్యుడి నీటి వచనాలు.