కొత్త మంత్రుల ఆర్భాటాలకు చిన్నారి బలైంది: చంద్రబాబు
అనంతపురము జిల్లా, కళ్యాణదుర్గంలో పసిపాప మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు..రాష్ట్రంలో కొత్త మంత్రులకు ఆర్భాటాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు..మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపు వల్ల పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు..ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోవడానికి కారణం అయ్యారని చంద్రబాబు ట్వీట్ చేశారు.ప్రాణాపాయంలో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణమని ఆయన మండిపడ్డారు.అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే చిన్నారిని అడ్డుకోవాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది? టీడీపీ అధినేత ప్రశ్నించారు..అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెపుతారన్నారు..చావు డప్పులో పదవీ సంబరాలు జరుపుకున్న మంత్రి..ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఏం సమాధానం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.