Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు?
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తేల్చింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా కొంకణ్ తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో.ఇవాళ, రేపు కూడా వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు నుంచి మధ్య మధ్యప్రదేశ్ వరకు గల ద్రోణి ఇప్పుడు దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్ వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ & పొరుగున గల ఉపరితల ఆవర్తనంతో కలసి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఉత్తర కోస్తాలో ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అంటున్నారు. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) వీచే అవకాశం ఉండడంతో సోమవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.