కాంగ్రెస్ టాప్ లీడర్ రాహుల్ గాంధీ పాస్ పోర్ట్ కష్టాలు పడుతున్నాడు. ఈ నెలాఖరుకు అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన రాహుల్ ఢిల్లీ కోర్టులో ఎన్వోసీ కోసం పిటిషన్ వేశారు.
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొత్త పాస్పోర్టు (Passport) కోసం కోర్టును ఆశ్రయించారు. సాధారణ పాస్పోర్టును పొందేందుకు నిరభ్యంతర పత్రాన్ని ఇవ్వాలంటూ బుధవారం దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 26న జరగనుంది. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్ (Rahul Gandhi)పై అనర్హత వేటు పడింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయ్యింది. ఫలితంగా రాహుల్ తన దౌత్య పాస్పోర్టు (Diplomatic Passport) సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సరెండర్ చేశారు. దీంతో ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో పాస్పోర్టు జారీ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇవ్వాలని దిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం.. శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది.
31 నుంచి అమెరికా టూర్
రాహుల్ గాంధీ ఈ నెల 31 నుంచి పది రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. జూన్ 4న న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లోగా పాస్ట్ పోర్ట్ వ్యవహారం తేలుతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
సుబ్రమణ్య స్వామి ఏమంటారంటే..
పాస్ పోర్టు మంజూరు చేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ పై మాజీ ఎంపి సుబ్రమణ్య స్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు ఆటకం కలుగుతుందని సుబ్రమణ్య స్వామి తెలిపారు. అయితే రాహుల్ పై ఎలాంటి పెండింగ్ కేసులూ లేవని రాహుల్ తరపు న్యాయవాది తెలిపారు.