Cji Chandrachud: అని భాషల్లో సుప్రీంకోర్టు తీర్పు కాపీలను అందజేయడమే మా లక్ష్యం..సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
Cji Chandrachud: మేం చేస్తున్న పని ప్రజలకు దాదాపుగా 99 శాతం మందికి చేరడం లేదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘ప్రతి భారతీయుడి భాషలో సుప్రీంకోర్టు తీర్పు కాపీలను చేరవేయడమే మా తదుపరి లక్ష్యం’ అని అన్నారు.ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రచూడ్ ప్రసంగాన్ని మోడీ షేర్ చేసారు.
దేశంలోని ప్రతి పౌరుడికి సత్వర న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. దేశం లో ఉన్న ప్రతి వ్యక్తికి అర్థమయ్యే భాషలో కోర్టు తీర్పులకు సంబంధించిన సమాచారాన్ని పొందనంత వరకు.. న్యాయ వ్యవస్థ అర్థవంతంగా ఉండదన్నారు.ఎవరికీ ఏమి అర్థంకాదన్నారు. మన దేశం లోని వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే తప్ప, మనం చేస్తున్నది 99 శాతం ప్రజలకు చేరదన్నారు. అలాచేస్తే కొద్దిమందివరకే తెలుస్తుంది. కానీ అన్ని భాషల్లో కాపీలను అందిస్తే కోర్టులు ఏంచేస్తున్నాయని దాదాపు ప్రతి పౌరునికి తెలియపరచచ్చు అన్నారు. కోర్టులను పేపర్లెస్, సాంకేతికత ప్రారంభించడం తన లక్ష్యమన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యంపై అభినందనలు తెలుపుతూ.. యువకులు, కొత్త న్యాయవాదులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నారు.
At a recent function, the Hon’ble CJI Justice DY Chandrachud spoke of the need to work towards making SC judgments available in regional languages. He also suggested the use of technology for it. This is a laudatory thought, which will help many people, particularly youngsters. pic.twitter.com/JQTXCI9gw0
— Narendra Modi (@narendramodi) January 22, 2023