ED on Kavitha: కవిత కేసులో ఎలాంటి ముందస్తు ఆర్డర్ పాస్ చేయొద్దు!
ED on Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసులో ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశం అయింది. అసలు కవిత కేసులో ఎలాంటి ముందస్తు ఆర్డర్ పాస్ చేయకూడదంటూ సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అసలు తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని ధర్మాసనాన్ని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ నమోదు చేసిన కేసులో మార్చి 11న విచారణ ఎదుర్కొన్న కవితను మార్చి 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. ముందుగా ఈడీ విచారణకు సిద్దమైన ఆమె ఏమనుకున్నారో ఏమో కానీ ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ మీద తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మార్చి 24న విచారణ చేపడతామని స్పష్టం సుప్రీం కోర్టు చేసింది. ఈ క్రమంలో కవిత పిటిషన్ పై ఈడీ కేవియట్ పిటిషన్ వేసిందని అంటున్నారు. దీంతో ఇరు వర్గాల పిటిషన్లపై మార్చి 24 న సుప్రీంలో విచారణ జరగనుండగా ఈడీతో పాటు కవిత తరపు లాయర్ తమ తమ వాదనలు వినిపించనున్నారు.