Karnataka: కర్ణాటకలో ఎట్టకేలకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) , ఉపముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (Dk shivakumar) ప్రమాణస్వీకారం చేశారు.
Karnataka: కర్ణాటకలో ఎట్టకేలకు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) , ఉపముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (Dk shivakumar) ప్రమాణస్వీకారం చేశారు. అలాగే కేబినెట్లో స్థానం సంపాదించుకున్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులతో కలిసి తొలి కేబినెట్ మీటింగ్ కోసం విధాన సౌధకు చేరుకున్నారు.
ఆ సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. విధాన సభలోకి వెళ్లేముందు డీకే శివకుమార్ తనదైన స్టైల్ని మరోసారి ప్రదర్శించారు. విధాన సౌధ మెట్ల వద్ద వంగి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత భవనంలోకి వెళ్లేముందు విక్టరీ సింబల్ చూపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలువుతున్నాయి. నెటిజన్లు డీకే శివకుమార్కి, సిద్ధరామయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
ఇకపోతే బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చేత, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ చేత కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేల చేత కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలు హాజరయ్యారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, చత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్విందర్ సింగ్, బీహార్ డీప్యూటీ సీఎం తేజస్వియాదవ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాజన్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
VIDEO | Karnataka CM @siddaramaiah and Deputy CM@DKShivakumar reach Vidhan Soudha after taking the oath. DK Shivakumar bends his forehead and touches the steps before entering the state assembly as a sign of respect. #Karnataka pic.twitter.com/3n7aJldbtE
— Press Trust of India (@PTI_News) May 20, 2023