Delhi Liquor Scam: మనీష్ సిసోడియా ఈడి ఇంట్రాగేషన్ లో సంచలన అంశాలు
Delhi Liquor Scam: మనీష్ సిసోడియా ఈడి ఇంట్రాగేషన్ లో సంచలన అంశాలు బయట పడ్డాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కై ఐదు శాతం నుంచి 12% మార్జిన్ పెంచారని, ఆధారాలు దొరక్కుండా డిజిటల్ ఫోన్లన్నీ ధ్వంసం చేశారని తేలింది. ఒబెరాయ్ హోటల్ కేంద్రంగానే ఇవన్నీ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని, లిక్కర్ కేసుకు సంబంధించిన కీలక డిజిటల్ సాక్షాలు మాయం చేశారని, లిక్కర్ స్కాం సమయంలో 14 ఫోన్లు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. మా సోదాల్లో ఒక్క ఫోన్ మాత్రమే సీజ్ చేశామని, ఇంట్రాగేషన్ లో మరో రెండు ఫోన్లు జమ చేశారని చెబుతున్నారు. 8 నెలల నుంచి వాడుతున్న ఫోనును ఎల్జీ ఫిర్యాదు చేసిన తేదీనే ధ్వంసం చేశారని, మద్యం కుంభ కోణం పై, ఢిల్లీ ఎల్జి ఫిర్యాదు చేసిన నాటి నుంచే ఫోన్లు ధ్వంసం చేశారని చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే సాక్షాలను మాయం చేశారని, అక్రమ నగదు చలామణి సంబంధించిన అనేక ఆధారాలు ఈ ఫోన్లో ఉన్నాయని ఈడీ చెబుతోంది.
ఇతరుల పేర్లతో సిమ్ కార్డులు, ఫోన్లు వాడుతున్నారని, ఇదంతా రొటీన్ ప్రాక్టీస్ లో భాగంగానే చేశానని ఈడీకి సిసోడియా చెప్పినట్టు తెలుస్తోంది. 6 నుంచి 12% కమిషన్ పెంచాలని మంత్రుల బృందం సమావేశంలో చర్చలు ఏమి జరగలేదన, కమిషన్ పెంచాలన్న నిర్ణయంలో మద్యం శాఖ పాత్ర ఏమీ లేదు అని అధికారులు తెలిపారని ఈడీ తేల్చింది. మనీష్ సిసోడియా వ్యక్తిగత కంప్యూటర్ నుంచి జీవోఎం నోటును డౌన్లోడ్ చేశామని, ఆ నోట్లో ఐదు శాతం కమిషన్ గురించి మాత్రమే ఉందని, సౌత్ గ్రూపుతో కుమ్మక్కు కావడంతో విచిత్రంగా నాలుగు రోజుల్లోనే పరిస్థితి మారిందని తేల్చింది. అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి మనీష్ సిసోడియా తన కార్యదర్శిని పిలిపించారని, ఆయన చేతికి 12 శాతం మార్జిన్ పెంచుతున్న మద్యం పాలసీ డ్రాఫ్ట్ రిపోర్టు చేతికి ఇచ్చారని, ఇది 2021 మార్చి 15 నుంచి 19 మధ్యలో జరిగిందని తేల్చింది.
సౌత్ గ్రూపు సభ్యులు అదే సమయంలో ఒబెరాయ్ హోటల్ లో మార్చి 14 నుంచి 17 వరకు మకాం వేసి ఉన్నారని, ఒబెరాయ్ హోటల్ బిజినెస్ సెంటర్లో 36 పేజీల మద్యం ముసాయిదా విధానం ప్రింట్ అవుట్ తీశారని, ఈ ముసాయిదాలోనే ఐదు నుంచి 12 శాతం మార్జిన్ పెంచారని పేర్కొన్నారు. సౌత్ గ్రూపుకు మనీష్ సిసోడియా కుమ్మక్కయ్యారనడానికి ఇదే ఒక పెద్ద సాక్షం అని పేర్కొన్నారు. క్యాబినెట్ కు వెళ్లడానికి రెండు రోజుల ముందే ఫైనల్ మద్యం పాలసీ సౌత్ గ్రూపు సభ్యుల మొబైల్ ఫోన్లో దొరికిందని, మాజీ ఎక్సైజ్ కమిషనర్ రాహుల్ సింగ్ , అమిత అరోరాను ఈనెల 20 విచారణకు పిలిచామని, డిప్యూటీ సీఎం సెక్రటరీ అరవింద్ 21వ తేదీన పిలిచామని, వీరందరిని మనీష్ సిసోడియతో కలిపి ఇంటరాగేషన్ చేయాలని ఈడీ కోరినట్టు తెలుస్తోంది.