India Corona: దేశంలో కరోనా ఉధృతి.. మరోసారి 20 వేలకు పైగా కేసులు నమోదు
Corona Cases Today Update: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 21 వేల 440 కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న ఒక్క రోజే కోవిడ్తో 67 మంది మరణించగా.. 20 వేల 726 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 98.46 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతానికి పెరిగింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు దేశంలో 4 లక్షల 80 వేల 202 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు కేంద్ర వైద్య అధికారులు.
కరోనాతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5 లక్షల 25 వేల 997 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 50 వేల 100 చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4 కోట్ల 38 లక్షల 68 వేల 476కి చేరగా.. ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుంచి 4 కోట్ల 31 లక్షల 92 వేల 379 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో భారత్లో 34 లక్షల 93 వేల 209 మందికి కోవిడ్ వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 201.68 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 3 లక్షల 49 వేల 174 మంది వైరస్ బారినపడగా.. కోవిడ్తో 335 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57 కోట్ల 11 లక్షల 73 వేల 227కు చేరింది. ఇప్పటివరకు మహమ్మారి కారణంగా 63 లక్షల 95 వేల 685 మంది మరణించారు.