Rahul Gandhi: శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ దూరం
Rahul Gandhi:ఈ సారి జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్తోపాటు పలువురు నాయకులు కూడా ఈ సమావేశాలకు గైర్హాజరవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ… ప్రస్తుత పరిస్థితుల్లో యాత్రకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగానే సమావేశాలకు దూరంగా ఉండి యాత్రను కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాహుల్ సన్నిహిత వర్గాలు కూడా జోడోయాత్రకే ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు.
శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే.. పోటీ చేసిన సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజ్యసభలో తదుపరి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎవరు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.