చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే.. మహిళా రిజర్వేషన్ బిల్లును సెంట్రల్ మినిష్టర్ అర్జున్ రామ్ మేఘావల్ ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర ప్రభుత్వం.. నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు పెట్టింది.
Womens Reservation Bill: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు(33 percent women reservation) కల్పించే.. మహిళా రిజర్వేషన్ బిల్లును సెంట్రల్ మినిష్టర్ అర్జున్ రామ్ మేఘావల్ ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర ప్రభుత్వం.. నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు పెట్టింది.
అయితే 2027 తర్వాతే 33 శాతం మహిళా రిజర్వేషన్ల (33 percent women reservation)బిల్లు అనేది అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.మరోవైపు ఈ మహిళా బిల్లు అమల్లోకి వస్తే.. మహిళా సభ్యుల సంఖ్య చట్ట సభల్లో ఇక 180 స్థానాలకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రత్యేకతలు
చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్ను.. ఈ మహిళా బిల్లు తప్పనిసరి చేస్తుంది. ఈ బిల్లు ప్రకారం లోక్సభలోని మూడు వంతుల్లో ఒక వంతు సీట్లును మహిళలకు రిజర్వ్ చేస్తారు. దీని వల్ల చట్ట సభలో మహిళల ప్రాధాన్యత పెరుగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకు కూడా మహిళా బిల్లు నిబంధనలు వర్తిస్తాయి. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తారు. ఈ విషయాన్ని బిల్లులో ఉన్న నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
అలాగే ఢిల్లీతో పాటు అన్నిరాష్ట్రాల శాసన సభలకు కూడా ఈ బిల్లు వర్తిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, తెగల రిజర్వేషన్లతో పాటు మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు రిజర్వ్ చేసే ఉంటాయి.రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు ఉంటుంది.
ఇక రిజర్వేషన్లకు సంబంధించి.. రాజ్యాంగంలో 128వ సవరణ చేశాక జనగణన ప్రారంభిస్తారని కేంద్ర పెద్దలు చెబుతున్నారు. ఈ లెక్కన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అంటే 2027 తర్వాత బిల్లు చట్ట రూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.