నారాలోకేశ్ యువగళం పాదయాత్రకు స్వల్ప విరామం. మహానాడుకు హాజరయ్యేందుకు లోకేశ్ కడప జిల్లా జమ్మలమడుగు వద్ద పాదయాత్రకు విరామం ప్రకటించారు. మళ్లీ నాలుగు రోజుల అనంతరం పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
Nara Lokesh Yuvagalam padayatra : నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara Lokesh Yuvagalam padayatra) జమ్మలమడుగు (Jammalamadugu)లో ముగిసింది. పాదయాత్రకు నాలుగు రోజుల పాటు బ్రేక్ (Break)పడింది . ఈనెల 27, 28 తేదీల్లో రాజమండ్రి (Rajamundry)లో టీడీపీ (TDP) మహానాడు (Mahanaadu)జరగనుంది. ఇందుకోసం పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి ఈనెల 30న జమ్మలమడుగు నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే పాదయాత్ర ముగించుకుని జమ్మలమడుగు నుంచీ కడప ఎయిర్పోర్టుకు బయల్దేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో నారా లోకేష్ అమరావతికి చేరుకోనున్నారు.
రేపు అమరావతి నుంచి రాజమండ్రికి…
శుక్రవారం అమరావతి నుంచి బయల్దేరి రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి వెళ్లనున్నారు. గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పెద్ద ఎత్తున దళితులు, మైనార్టీలు, రైతులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.
లింగారెడ్డిపై లోకేశ్ ఫైర్
కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిపై ఫైర్ అయ్యారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొత్త పల్లి క్యాంప్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన కొద్దిసేపటి తర్వాత ఫోటో కోసం తరచూ విసిగిస్తున్న లింగారెడ్డిపై లోకేశ్ మండిపడ్డారు. ఆయన్ను పిలిచి మందలించారు. లింగారెడ్డిని పాదయాత్ర నుంచి సెక్యూరిటీ సిబ్బంది పక్కకు నెట్టేశారు.