ఎన్నికల వ్యూహంతో ముందుకెళుతోన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది
GROUP ONE NOTIFICATION : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్-1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిషికేషన్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. కాగా బుధవారం ఉదయం ఈ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. సీఎం ఆదేశాలతో పోస్టుల భర్తీ ప్రక్రియ చకచకా సాగుతోంది.
ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని తెలిపారు.
మొత్తం 1000 పోస్టులు..
గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం ఆదేశించారని. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుందని పేర్కొన్నారు.