Raj Bhavan: సీఎస్ శాంతకుమారికి చురకలు అంటించిన గవర్నర్ తమిళసై
TS Governor fires on TS Chief Secretary Shanta Kumari
తెలంగాణలో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. ఈ విషయంలో తాజా పరిణామాలు మరింత హీట్ పెంచుతున్నాయి. తెలంగాణ సీఎల్ శాంతకుమారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ 10 బిల్లులను పాస్ చేయకుండా తన వద్దే ఉంచుకున్నారని, 5 నెలలు గడిచినా బిల్లులు ఆమోదించలేదని తెలంగాణ సీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ కన్నా రాజ్ భవన్ దగ్గరగానే ఉంది
చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శాంతి కుమారి తనను ఒక్కసారి కూడా కలవలేదని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించలేదని ఫైర్ అయ్యారు. కనీసం మర్యాదపూర్వకంగా ఓ కాల్ కూడా చేయలేదని గవర్నర్ మండిపడ్డారు.మర్యాదపూర్వక సమావేశాలు, సంప్రదింపుల కారణంగా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని, అటువంటివి ఏమీ చేయలేదని గుర్తుచేశారు. ఢిల్లీ కన్నా రాజ్ భవన్ దగ్గరగానే ఉందని చురకలు అంటించారు.
Dear @TelanganaCS Rajbhavan is nearer than Delhi. Assuming office as CS you didn't find time to visit Rahbhavan officially. No protocol!No courtesy even for courtesy call. Friendly official visits & interactions would have been more helpfull which you Don't even intend.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 3, 2023
Again i remind you Rajbhavan is nearer than Delhi @TelanganaCS
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 3, 2023
RajBhavan