Minister Dayakar Rao: ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉండొద్దన్న నిబంధన తొలగించండి..మంత్రి ఎర్రబెల్లి కి వినతి
Minister Dayakar Rao:స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉండకూడదు అన్న నిబంధనను తొలగించాలని కోరుతూ గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వినతిపత్రం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ నిబంధన ఉందని మనకంటే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలు కూడా కాలేదని తన వినతిపత్రంలో పేర్కొన్నారు.
స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డలకు ఇది అడ్డంకిగా మారిందన్నారు. కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలుగుతోందని దీనివల్ల వారు సమాజానికి రాజకీయాల ద్వారా సేవ చేయడానికి అనర్హులు కావడం విచారకరమన్నారు. కాబట్టి దేశంలో ఎక్కడా లేని నిబంధన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నందున దీనిని వెంటనే తొలగించి, ఇద్దరు కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన తెలంగాణ ప్రజలు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అవకాశాలు కల్పించాలని కోరారు. జిసిసి మాజీ చైర్మన్ గాంధీ నాయక్ విజ్ణప్తి మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుగారు దీనిని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.