CM Ramesh: హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రిక్కీ నిర్వహిస్తున్నారన్న వార్తల పై బిజెపి నేత సీఎం రమేష్ స్పందించారు. పవన్ కు తగినంత భద్రతను కల్పించాలని కోరారు. ఆయన ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారనే వార్తలు వస్తున్నాయని… అయినప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు ఆయన భద్రతను పట్టించుకోరా? అని ప్రశ్నించారు. వైస్సార్సీపీ కార్యకర్తల మాదిరి పోలీసులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. పవన్ కు తక్షణమే భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ ను వెంట అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నాయని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. విశాఖ ఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడుతున్నారన్నారు. పవన్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అయితే తాజాగా పోలీసులు ఇవన్నీ నిజం కాదని తేల్చారు..ఆదిత్య విజయ్, వినోద్, సాయి కృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు పక్కనే ఉన్న ఒక పబ్ లో మద్యం తాగి వస్తూ పవన్ ఇంటి వద్ద కారు నిలిపారు.. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వచ్చి కారు అక్కడ నుంచి తీసివేయాలని అనడంతో గొడవ మొదలైందని పోలీసులు వెల్లడించారు.