Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై పార్లమెంట్ బృందం ప్రశంసలు
Parliamentary Standing committee complimented Hyderabad Metro Rail
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన 14 మంది సభ్యులు హైదరాబాద్ మెట్రోరైలులో ప్రయాణం చేశారు. శనివారం రాత్రి రాయదుర్గ్ నుండి అమీర్పేట్ స్టేషన్ల వరకు కమిటీ సభ్యులు ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రోకార్యకలాపాలకు పరిశీలించారు. ప్రశంసలు కురిపించారు. PPP విధానంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్గా హైదరాబాద్ మెట్రో రైలు ఖ్యాతి గాంచిన విషయాన్ని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
రాజీవ్ రంజన్ సింగ్ నేతృత్వంలోని హైదరాబాద్ వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ టీమ్ అనేక విషయాలను దగ్గర నుంచి పరిశీలించింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డిని, ఎల్ అండ్ టీ ఎంగీ కేవీబీ రెడ్డిని కలిశారు. గత 5 సంవత్సరాలుగా హైదరాబాద్ మెట్రో నడుస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
మెట్రో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఎన్వీఎస్ రెడ్డి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరించారు. అమీర్ పేట్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ ను కమిటీ సభ్యులకు చూపించారు. అదే విధంగా త్వరలో ప్రారంభం కానున్న ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ ప్రెస్ గురించి కూడా కమిటీ సభ్యులకు వివరించారు. సర్వే పూర్తయిన వెంటనే పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్వీఎస్ రెడ్డి వారికి వివరించారు.