CJI: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి OU గౌరవ డాక్టరేట్
Osmania University: సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఆగస్ట్ 5న క్యాంపస్లో జరగనున్న 82వ స్నాతకోత్సవ కార్యక్రామానికి ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలిపారు. కులపతి హోదాలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ హజరౌతారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ చివరగా 2001లో భారత-అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్ అరుణ్త్రావలికి డాక్టరేట్ను ప్రధానం చేసింది.
ప్రస్తుతం 21 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ మళ్లీ డాక్టరేట్ ప్రధానం చేయబోతుంది. నిజాం కాలంలో నిర్మించిన ఈ క్యాంపస్ ఎంతో చరిత్ర కలిగి ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటి వరకు 47 మందికి గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేసింది. తొలిసారి 1917లో నవాబ్ జమాదుల్ ముల్క్ బహదూర్కు డాక్టరేట్ ప్రధానం చేసింది. తర్వాత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఓయూ నుంచి డాక్టరేట్ను అందుకున్నారు. అనంతరం సి.రాజగోపాలాచారి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ వై.నాయుడమ్మ, డాక్టర్ మన్మోహన్సింగ్ వంటి ప్రముఖులెందరో ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ప్రస్తుతం వారి సరసన జస్టిస్ ఎన్.వి.రమణ నిలవనున్నారు.