వరంగల్కు చెందిన కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఇటీవల డ్రైవర్లెస్ ఆటోనమస్ ట్రాక్టర్ ను డెవలప్ చేసింది. డ్రైవర్ లేకుండానే ఆ ట్రాక్టర్ అరక దున్నేస్తోంది.
Minister KTR: వరంగల్కు చెందిన కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ ఇటీవల డ్రైవర్లెస్ ఆటోనమస్ ట్రాక్టర్ ను డెవలప్ చేసింది. డ్రైవర్ లేకుండానే ఆ ట్రాక్టర్ అరక దున్నేస్తోంది. దానికి సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.ఆ ట్రాక్టర్ను చూసి ఫిదా అయ్యారు. ఆ ట్రాక్టర్ను డెవలప్ చేసిన తీరు తనను ఎంతో ఇంప్రెస్ చేసినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.. దీన్ని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ ఇలాంటి ఆవిష్కరణలతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో సాగు ఇదే మాదిరిగా ఉంటుంది. సమాజంపై తమదైన ముద్ర వేయాలని కోరుకునే యువ ఆవిష్కర్తలు ఇలాంటి మరిన్ని ఆలోచనలు, ఉత్పత్తులతో ముందుకు రావాలి. ఆవిష్కరణ, రూపకల్పన, అమలు చేయడం అన్నీ సామాజిక మార్పు కోసమే అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సమాజంపై ప్రభావం చూపే ఆవిష్కరణలకు చెందిన ఐడియాలు, ఉత్పత్తులతో యువత ముందుకు రావాలని మంత్రి కోరారు. యువత మరింత ఆవిష్కర్తలు గా రూపుదిద్దుకోవాలంటే టీహబ్ , టీవర్క్స్, వీహబ్ లాంటి సంస్థలు సహకరించేందుకు సిద్దంగా ఉన్నాయని మంత్రి అన్నారు.
Was impressed with the Driverless autonomous Tractor developed by the team at KITS (Kakatiya Institute of Technological Sciences), Warangal 👏
This is the future of Farming & I urge young innovators who would want to make a social impact to come out with more such ideas &… pic.twitter.com/7viPAHLTia
— KTR (@KTRBRS) May 16, 2023