Minister Ktr: కేటీఆర్ కు ఓ మహిళ ట్వీట్..ధన్యవాదాలు అంటూ రీ ట్వీట్
Minister Ktr: రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు. ఎవరు ఏ ఆపదలో ఉన్న, ఏ కష్టమొచ్చినా పగలు రాత్రి తేడాలేకుండా వాటికీ స్పందిస్తూ సమస్యపరిష్కరిస్తాడు. ఓవైపు కవితకు ఈడి నోటీసులు ఇవ్వడంతో రాష్టంలోని ప్రతి బిఆర్ఎస్ నేత కంగారుపడుతుంటే. నిన్న కవిత జంతరమంతర్ మహిళా రిజర్వేషన్స్ కోసం దీక్షకు పూనుకున్నారు. అలాగే హైదరాబాద్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశంకూడా జరిగింది. ఒక్కో నేతకు తినడానికి సమయంకూడా దొరకక బిజీ షెడ్యూల్లో ఉంటె కేటీఆర్ మాత్రం ఓవైపు పార్టీపనుల్లో పాల్గొంటూ.. మరోవైపు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం లో కేటీఆర్ ముందున్నారు. ఇప్పటికే ఎంతోమందికి సాయం చేసిన కేటీఆర్..తాజాగా రాత్రి పూట మహిళ ప్రయాణికురాలు పడుతున్న ఇబ్బందికి వెంటనే స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు.
ఓ మహిళా మంత్రి కేటీఆర్ కు ఓ ట్వీట్ చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట రాత్రి 10 తర్వాత మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు సురక్షితమైన రవాణా సౌకర్యం అందించాలని హర్షిత అనే మహిళ కేటీఆర్ కి ట్విట్ చేసింది. ఈమె ట్విట్ కి మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. ఒక్క సికింద్రాబాద్ మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ట్రాకింగ్ వ్యవస్థను తీసుకు వచ్చి మహిళలకు సురక్షితమైన రవాణా ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు. మీ విలువైన సూచనను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం.. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కేటీఆర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. కేటీఆర్ సూచనకు తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్. రైల్వే, బస్టాండ్ వద్ద జీపీఎస్ ట్రాకింగ్ మెకానిజమ్ తో రాత్రి సమయంలో ఆటోలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే మహిళలు సురక్షిత ప్రయాణం చేసేలా తగిన రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని..రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నామని ఎవరికైనా ఆపద అనిపిస్తే వెంటనే పోలీసులుకు కాల్ చేయాలని తెలిపారు.
Request @TelanganaDGP to consider this at the earliest and institute such mechanism at all Railway and Bus stations across the state
Thank You Harshitha Garu for your suggestion https://t.co/KwBqJ1krXq
— KTR (@KTRBRS) March 10, 2023