Minister Koppula Eshwar: అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులలో వేగం పెంచాలి.. మంత్రి కొప్పుల
Minister Koppula Eshwar: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ విగ్రహం నిర్మాణం పనులను పరిశీలించారు. అంతకుముందు వారం కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విగ్రహం నిర్మాణం పనులు పరిశీలించిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా అంబేద్కర్ విగ్రహం నిర్మాణపనులను పరిశీలించారు.
నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన కొప్పుల మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం ఆవిష్కరించునున్నట్లు వెల్లడించారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్ తరాలు నిత్యం స్మరించుకునేలా హుస్సేన్సాగర్ తీరంలో భారీ విగ్రహాన్ని నిర్మించతలపెట్టినట్టు త్రి చెప్పారు. వేగంగా పనులు చేసి గడువు లోపు పూర్తి చేయాలని కోరారు. ఏప్రిల్ 14న అట్టహాసంగా జరిగే ఈ విగ్రహావిష్కరణకు దేశంలోని పలువురు ప్రముఖులు హాజరవుతున్నందున ఏప్రిల్ 5లోగా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.