Jyotiraditya Scindia : కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య హైదరాబాద్ పర్యటన
Minister Jyotiraditya Scindia to Visits Hyderabad : నేడు సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా హైదరాబాద్ పర్యటన చేపట్టబోతున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొనేందుకు సింథియా వస్తున్నారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటనలో పాల్గొననున్న ఆయన తాజ్ ఫలక్ నామ లో బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జ్యోతిరాధిత్య సింథియా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారులు, మేధావులతో సమావేశం కానున్నారు.
సింథియా పర్యటన విషయానికొస్తే రేపు 11 గంటలకు హైదరాబాద్ పార్లమెంట్ కోర్ కమిటి సమావేశం జరగనుంది. ఆ తరువాత రేపు 12 గంటలకు హైదరాబాద్ జిల్లా పార్టీ పదాధికారుల సమావేశం కానుంది. అనంతరం 12.45కి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 2 గంటలకు గౌలిపురా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొననున్న సింథియా సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు రాజస్థాన్ భవన్ లో ఐటి, సోషల్ మీడియాతో సమావేశం కానున్న సింథియా శనివారం ఉదయం 7 జిల్లాల మోర్చాల అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఇక శనివారం ఉదయం 11 గంటలకు కార్వాన్ లో మొదటి సారి ఓటు వేయనున్న యువతతో సింథియా సమావేశం కాబోతున్నారు.