వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఘటన అందరికీ తెలిసిందే
Govt Job to Medico Preethi Sister: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఘటన అందరికీ తెలిసిందే. ఈ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రీతి చనిపోయిన సమయంలో పలువురు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అదే టైంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి.. సీఏం ఆదేశాలమేరకు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రీతి చెల్లి పూజకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఇచ్చిన మాట ప్రకారం.. ఇపుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ (హెచ్ఎమ్ డీఏ)లో ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
ఐటీ సెల్లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గాను ప్రీతి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇప్పటికే గవర్నమెంట్ ప్రకటించిన పరిహారంతో పాటు పార్టీ తరపున సేకరించిన విరాళాలను కూడా కలిపి ప్రీతి కుటుంబానికి అందజేశాం. అదే సమయంలో తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని వారు కోరగా.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టి తీసుకెళ్లాం. అందుకు సాకుకూలంటా స్పందించిన కేటీఆర్.. ఉద్యోగం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆకుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపాడు.
2023 ఫిబ్రవరి 22న పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది ప్రీతి. దీంతో కోమాలోకి వెళ్లిన ప్రీతిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకొచ్చారు. ప్రీతిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.