CARO in Telangna: తెలంగాణకు మోదీ సర్కారు మరో కానుక
CARO in Telangna: తెలంగాణకు మోదీ సర్కారు మరో కానుక ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ (CARO) ఏర్పాటు చేయనున్నామని అన్నారు. భారతదేశంలో తొలి ‘గృహ-5’ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ కేంద్రం ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నామని అన్నారు. శరవేగంగా పనులు సాగుతున్న క్రమంలో ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యం అని అన్నారు. హైదరాబాద్లో 2018లో ఈ పౌర విమానయాన పరిశోధన సంస్థ (కారో)కు శంకుస్థాపన జరిగింది. అప్పటి కేంద్ర మంత్రి సురేష్ప్రభు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైపౌర విమానయాన పరిశోధన సంస్థకు శంకుస్థాపన చేశారు. బేగంపేటలోని 27 ఎకరాల్లో పౌర విమానయాన పరిశోధన సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పరిశోధన, విమానయాన అభివృద్ధి, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, ఎయిర్ ట్రాఫికింగ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్ డొమైన్ ఎమ్యులేషన్ , నెట్వర్క్ ఎమ్యులేటర్, అనాలసిస్ ల్యాబ్స్ ఏర్పాటవుతాయి. అంతేకాకుండా ప్రమాద విశ్లేషణ కేంద్రం, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, డేటా మేనేజ్మెంట్ , ప్రాజెక్ట్ సపోర్ట్, సాఫ్ట్వేర్ సొల్యూషన్ సెంటర్ లు కూడా ఈ కేంద్రంలో ఉంటాయి.