BRS: ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం..బాధ్యతలు ఆయనకేనా ?
BRS: స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చి తెలంగాణ నుసాధించి అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్..ఇప్పుడు దేశాన్ని మరింత అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. మొన్నటి వరకు తెలంగాణకే పరిమితమైన పార్టీ ని ఇప్పుడు ‘బీఆర్ఎస్’ గా జాతీయ పార్టీ గా ఆవిర్భవించారు. 21 ఏళ్లలో పార్టీ..60 లక్షల మంది పైగా కార్యకర్తలు ఉన్న టీఆర్ఎస్ తెలంగాణ పేరు స్థానంలో ఇప్పుడు బీఆర్ఎస్ గా ఇక కొనసాగనుంది.
పార్టీ అధినేత – తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను మొన్న శుక్రవారం నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 1.20 గంటలకు ఆవిష్కరించారు. పార్టీ అధినేతగా బీఆర్ఎస్ పత్రాల పైన సంతకాలు చేసారు. పార్టీ నేతలందరికీ బీఆర్ఎస్ కండువాలు కప్పారు. అందులో భాగంగా ఏపీలోనూ బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటకు సన్నాహాలు మొదలెట్టేశారు.
విజయవాడలో పార్టీ ఆఫీస్ పెట్టనున్నారని సమాచారం. జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవే సమీపంలో.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఏపీలో పార్టీ ఆఫీసు నిర్మాణ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబరు 18, 19వ తేదీల్లో మంత్రి తలసాని విజయవాడలో పర్యటించనున్నారని సమాచారం. జక్కంపూడికి వెళ్లి.. పార్టీ నిర్మాణాన్ని చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించనున్నారట. ఇక సీఎం కేసీఆర్ కు ఆంధ్రాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని తెలుసు కేసీఆర్ ఎప్పుడైనా ఆంధ్రాలో పర్యటనకు వెళ్తే భారీ స్వాగతతోరణాలతో సీఎం కేసీఆర్ కు అభిమానులు స్వాగతం పలుకుతారు.