హైదరాబాద్ నుంచి విమానాశ్రయానికి చేరుకోడానికి ఇప్పటికే మెరుగైన రహదారి మార్గం ఉంది. ఆర్టీసీ పుష్పక్ బస్సులను నడుపుతోంది. మరింత సులువుగా హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకి చేరుకునేలా మెట్రో రెండో దశ 2018లో తెరపైకి వచ్చింది
Airport Metro: హైదరాబాద్ నుంచి విమానాశ్రయానికి చేరుకోడానికి ఇప్పటికే మెరుగైన రహదారి మార్గం ఉంది. ఆర్టీసీ పుష్పక్ బస్సులను నడుపుతోంది. మరింత సులువుగా హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకి చేరుకునేలా మెట్రో రెండో దశ 2018లో తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2018 మార్చిలోనే హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ మార్గానికి హెచ్ఎంఆర్ఎల్ డిపిఆర్ను రూపొందించింది. నిధులు లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అయితే ఈ ఏడాది బడ్జెట్లో మెట్రోకు తగిన నిధులు కేటాయించడంతో ఆ ప్రాజెక్టు ఇప్పుడు శరవేగంగా దూసుకుపోనుంది. అందుకు సంబంధించి ఈ ఏడాది సిఎం కెసిఆర్ పచ్చజెండాఊపి శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పుడు టెండర్లు పిలవడంతో ఆ ప్రాజెక్టు వేగం పుంజుకోనుంది. మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎన్నికల నాటికి కనీస భూసేకరణ చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఎయిర్పోర్టు మెట్రో నిర్మాణానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. నేటి నుండి బిడ్డింగ్ పత్రాలను హెచ్ఏఎంఆర్ఎల్ జారీ చేయనుంది. ఎయిర్పోర్టు మెట్రో బిడ్డింగ్కు చివరి తేదీ జులై 5 గా నిర్దారించింది. ఐటీ కారిడార్..శంషాబాద్ ఎయిర్పోర్టు..నగర శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఈ రెండింటి మధ్య వారధిగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఇప్పటికే అత్యంత కీలకమైన రోడ్డు మార్గంగా నిలిచింది.
మెట్రో కాంట్రాక్ట్ విలువ రూ. 5,688 కోట్లుగా నిర్ధారించింది. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మించనున్నారు. ఈ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ మెట్రోకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 9కిలో మీటర్ల దూరంలో ఎయిర్పోర్టు టెర్మినల్ నిర్మాణం, ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్లుక్లోజ్డ్ సర్క్యూట్తో ఉంటాయి. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్టులో కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా రెండు స్టేషన్లు నిర్మించనుంది. ఇక ఈ స్టేషన్ లో ఆరు బోగీలు నిలిపేలా మెట్రోస్టేషన్ నిర్మాణంచేపట్టగా తొలి దశలో మూడు బోగీలు మాత్రమే నిలుపనున్నారు. రాయదుర్గం నుండి బయో డైవర్సిటీ, ఖాజాగూడ చెరువు పక్క నుంచి నానక్రాంగూడ కూడలి, అక్కడి నుంచి ఓఆర్ఆర్ పక్క నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్, విమానాశ్రయ కార్గో మీదుగా విమానాశ్రయంలోకి నేరుగా చేరుకునేలా జీఎంఆర్ సమన్వయంతో ఈ ఎలైన్మెంట్ రూపొందించారు.
భూసామర్థ్య పరీక్షల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు . ఈ టెండర్కు ఎంపికైన కాంట్రాక్టర్ మెట్రో రైలు వ్యవస్థకు అవసరమైన ఎలివేటెడ్ వయాడక్ట్, భూగర్భ పనులు, స్టేషన్లు, ట్రాక్ పనులు, ఎలక్ట్రికల్, మెకానికల్ పనులు, సరఫరా, రైలు బోగీలు, ఎలక్ట్రిక్ ట్రాక్షన్, విద్యుత్ సరఫరా, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లు మొదలైనవి పూర్తిచేయాల్సి ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. అలైన్మెంట్ ఫిక్సేషన్ వంటి ప్రాథమిక పనులన్నీ పూర్తయ్యాయని ఆయన తెలిపారు. భూసామర్థ్య పరీక్షల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ఎయిర్ పోర్ట్ మెట్రో కోసం చేపట్టిన కొత్త సర్వే ప్రకారం రాయదుర్గ్ మెట్రోస్టేషన్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ స్టేషన్ల మధ్య మొత్తం దూరం 31 కి.మీలు కాగా, ఇందులో పిల్లర్లపై ఎలివేటెడ్ 29.3 కి.మీలని, అండర్ గ్రౌండ్లో 1.7 కి.మీ పొడవునా పనులు జరుగుతాయన్నారు.
ఈ ఎయిర్ పోర్టు మెట్రోలో, నగరంలో తిరుగుతున్న మెట్రో కన్నా మరింత అధునాతన సౌకర్యాలు కల్పిస్తారు. ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించేలా ఛైర్కార్ సీట్లు ఉంటాయి. ప్లాట్ఫాంపై భద్రత కోసం విదేశాల్లో మాదిరిగా అద్దాలతో కూడిన స్క్రీన్ విండోస్ ఏర్పాటు చేస్తారు. లైట్ వెయిట్ స్టెయిన్ లెస్ స్టీల్ అల్యూమినియం కోచ్లు ఉంటాయి. మలుపుల్లో కూడా మెట్రో రైళ్లు వేగంగా వెళ్లడానికి వీలుగా ఏరో డైనమిక్స్లో మార్పు చేస్తారు. మెట్రో స్టేషన్లలో విమాన రాకపోకల సమాచారం తెలిపే ఎల్ఈడీ బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం .