Veera Simhaa Reddy: ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్- భారీ ఏర్పాట్లు
Veera Simhaa Reddy Pre Release: బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేదిక ను మార్పు చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఒంగోలులోని ఏబీఎం కళాశాల మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేసుకోగా భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ప్రత్యామ్యాన స్థలం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు అధికారులు సూచించిన నేపథ్యంలో వేదికను మార్పు చేశారు. వేదికను అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్ కి మార్చినట్లు మేకర్స్ స్పష్టం చేశారు. నేడు అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్ లో ‘వీర సింహ రెడ్డి’ ప్రీరిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగనుంది.
ఈ ఈవెంట్ను కలర్ఫుల్గా ప్లాన్ చేసింది ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయస్ మీడియా. ప్రోగ్రాం సౌత్ వైపు ఈవెంట్ మెయిన్ డయాస్ ఉంటుంది. ఎదురుగా 100 అడుగుల వరకు విఐపిలు ఆ తరువాత 10 అడుగుల మేర బారికేడ్లు, తరువాత అభిమానులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే నిబంధనలు పాటిస్తూ.. ప్రోగ్రాం నిర్వహించాలని చిత్ర యూనిట్ కి పోలీసులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఫ్రీ రిలీజ్ వేడుక జరుగనుంది.
ఈ ఈవెంట్ కి హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ ,చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు. ఇక ఈ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్ట్ తమన్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఇక బాలకృష్ణ ఒంగోలు కు ప్రత్యేక హెలిక్రాఫ్టర్ ద్వారా రానున్నారు. బాలయ్యను చూడడానికి అధిక సంఖ్యలో అభిమానులు రానుండడంతో ఈ కార్యక్రమానికి పాసులు ఉన్న వారికే అనుమతి ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసారు.
Venue changed but the MASS fervor remains 🔥🔥#VeeraSimhaReddy Grand Pre Release Event on 6th Jan from 6 PM onwards at Arjun Infra Ground, Ongole
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @shreyasgroup @SonyMusicSouth pic.twitter.com/5C7n8EjP8Y
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2023