RGV: కమ్మోళ్లకు కాంగ్రాట్స్ చెప్పిన రాంగోపాల్ వర్మ, ఎందుకంటే..
RGV indirect comments on Pawan Kalyan and Chandra Babu naidu
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ ట్వీట్ చేశారు. కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కమ్మోళ్లకు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. ఏపీ రాజకీయాలను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు, ఆర్జీవీ ఎవరి గురించి ట్వీట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని కలిసిన నేపథ్యంతో ఆర్జీవీ చేసిన ట్వీట్ చర్చనీయాశంగా మారింది.
కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు 😔😔😔
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2023
ఇటీవలే కందుకూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. ఈ సందర్భంగా కూడా రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాలను వెల్లడించారు. .ప్రత్యేక వీడియోను రూపొందించారు. తన ఆవేదనను వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై నేరుగా విమర్శలు సంధించారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని ఆరోపించారు. పబ్లిసిటీ కోసం జనాల ప్రాణాలు తీస్తారా అంటూ ప్రశ్నించారు. జనం ప్రాణాల కన్నా బాబుకు తన పాపులారిటీనే ముఖ్యమని రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆ వీడియోను పోస్టు చేశారు.
ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి జనాలు ఎక్కువ మంది వచ్చినట్లు చూపించుకోడానికి చేసిన ప్రయత్నాన్ని రాంగోపాల్ వర్మ తప్పుబట్టారు. కుక్కలకు బిస్కెట్లు, మేకలకు దాణా పడేసినట్లు వాహనం నుంచి ప్యాకెట్లు పడేయడంపై ఆర్జీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీనియర్ రాజకీయ నేతగా విపరీతమైన అనుభవం కలిగిన చంద్రబాబుకు ఇటువంటి సభలు నిర్వహిస్తే ఏం జరుగుతుందో తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. బాబుకు వ్యక్తిగత ప్రయోజనాలు తప్పిస్తే వేరే విషయాలు పట్టవని విమర్శించారు. ఎంత మంది చనిపోతే అంత గొప్పగా చంద్రబాబు ఫీలౌతున్నారని రాంగోపాల్ వర్మ అన్నారు. తన కోసం ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీ ఉన్నట్లు చంద్రబాబు భావిస్తున్నారని ఆర్జీవీ అన్నారు.
తన సభల కోసం వచ్చిన వాళ్లు చనిపోతుంటే..తనకేం సంబంధం లేనట్లుగా బాబు వ్యవహరించడం పట్ల కూడా రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. వేరే వాళ్లపై నిందను మోపడం సరికాదని అన్నారు.
ఇరుకు సందుల్లో మీటింగులు పెడితే ఏం జరుగుతుందో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు తెలియదని చెబితే ఏవరూ నమ్మరని రాంగోపాల్ వర్మ అన్నారు. ప్రజల ప్రాణాల కంటే పాపులారిటీ దక్కించుకోవడమే చంద్రబాబుకున్న ఏకైన లక్ష్యమని ఆర్జీవీ అన్నారు. ఇటువంటి సంఘటలనకు కారకుడైన చంద్రబాబును మీరు అని పిలవనని, నిన్ను అని సంభోదిస్తానని రాంగోపాల్ వర్మ అన్నారు.
ప్రజలను చంపి, వాళ్ల మీద నుంచొని పాపులారిటీ పొందడానికి ప్రయత్నించడం చాలా పెద్ద తప్పిదమని రాంగోపాల్ వర్మ అన్నారు. హిట్లర్, ముస్సోలినీ తర్వాత అంత పెద్ద నియంతవు నువ్వే అని చంద్రబాబును అన్నారు.