Rangamarthanda: ‘రంగమార్తాండ’ నుండి సెకండ్ సింగిల్ ‘నన్ను నన్నుగా’ విడుదల
Rangamarthanda: ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ (షాయరి) నేనొక నటుడ్ని విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. మెగస్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ ను రచయిత లక్ష్మీ భూపాల రచించారు.
తాజాగా ఈ చిత్రంనుండి సెకండ్ సింగిల్ ‘నన్ను నన్నుగా’ విడుదల చేసారు. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ఈ సాంగ్ లో మెరిశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతంగా సాహిత్యం అందించారు. సింగర్ శ్రీ గాయత్రి రంజని ఈ పాటను ఆలపించారు. ఈ పాటతో మరోసారి సిరివెన్నెల పేరు మారుమోగుతోంది. చక్కని సాహిత్యం ఈ పాటకి ఆయన అందించారు. అలాగే ఇళయరాజా మ్యూజిక్ కూడా ఈ పాటని ఓ రేంజ్కి తీసుకెళ్లింది. ‘రంగమార్తాండ’ చిత్రం రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథగా తెరకెక్కనుందని సమాచారం. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.