హరిహర వీరమల్లులోకి తోట తరణి ని ఆహ్వానించిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహరవీరమల్లు. పీరియాడికల్ డ్రామా గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోకి కళాదర్శకులు ‘పద్మశ్రీ’ తోట తరణి అడుగుపెట్టారు. ఆయన్ను సెట్ లోకి స్వయంగా పవన్ కల్యాణే ఆహ్వానించారు. శుక్రవారం తోట తరణి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ స్పాట్ కి వచ్చిన సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం అందించి హార్ధిక స్వాగతం పలికారు.